పట్టపగలు బహిరంగసభలో ఒరిస్సా ఎమ్మెల్యే హత్య

39 ఏళ్ల జగబంధు ప్రముఖ గిరిజన నాయకుడు. ఉమర్కోట నియోజకవర్గం నుంచి ఆయన శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. భూమి పట్టాలు పంపిణీ చేయడానికి గోనా గ్రామానికి వెళ్లినప్పుడు జగబంధును కాల్చి చంపారు. పట్టాలు పంపిణీ చేస్తుండగా నలుగురు గుర్తు తెలియని సాయుధులు వేదిక వద్దకు కాల్పులు జరిపారని, ఆ కాల్పుల్లో శాసనసభ్యుడు, సెక్యూరిటీ ఆఫీసర్ మరణించినట్లు పోలీసు డైరెక్టర్ జనరల్ మన్మోహన్ ప్రహరాజ్ చెప్పారు. జగబంధు, భద్రతాధికారి పికె పాత్రో మృతదేహాలను రాయగడ్ పోలీసు స్టేషనుకు తరలించారు.












Click it and Unblock the Notifications