తెలంగాణకు కాంగ్రెసు రెడీ, హైదరాబాద్ కిరికిరి: కెసిఆర్

తెలంగాణ రాష్ట్రంలో రాయలసీమకు చెందిన అనంతపురం, కర్నూలు జిల్లాలను కలపాలనే ప్రతిపాదన పెడుతోందని, దీనికి అసదుద్దీన్ కూడా సుముఖంగా ఉన్నారని ఆయన చెప్పారు. అనంతపురం, కర్నూలు జిల్లాలను తెలంగాణ కలిపితే తమకు అభ్యంతరం లేదని, దాని వల్ల పార్లమెంటు, శాసనసభ స్థానాలు కూడా రెండు రాష్ట్రాల్లో సమానంగా ఉంటాయని ఆయన అన్నారు. మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోవడానికి గతంలో రాయలసీమ ఇష్టపడలేదని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వల్ల రాయలసీమకు నీటి సమస్య వస్తుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని, కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణలో కలిపితే ఆ సమస్య తీరుతుందని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన జరిగితే తమ హక్కులకు భంగం వాటిల్లుతుందని రాయలసీమవాళ్లు భయపడుతున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications