పరిటాల హత్య: చంద్రబాబుకు శైలజానాథ్ కౌంటర్

కాగా గురువారం చంద్రబాబు తన అనంత పర్యటనలో పరిటాలను హత్య చేయించింది వైయస్సే అని తీవ్రమైన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. శుక్రవారమూ అనంతలో పర్యటించిన బాబు కాంగ్రెసు ప్రభుత్వ హయాంలో టిడిపి కార్యకర్తలను హతమార్చుతున్నారన్నారని మరోసారి ఆరోపించారు. టిడిపి కార్యకర్తల హత్యలు కాంగ్రెసు రాక్షస ప్రవృత్తికి నిదర్శనమన్నారు. పోలీసులు సరిగా వ్యవహరించడం లేదని విమర్శించారు. ధర్మవరంలోని హత్యలపై పార్టీ తరఫున హైకోర్టులో రిట్ పిటిషన్ వేస్తామని చెప్పారు. జిల్లాలో హత్యా రాజకీయాలకు పాల్పడుతున్న ఎమ్మెల్యేను, ఆయన అనుచరులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల హత్యకు గురైన టిడిపి కార్యకర్తల కుటుంబాలను పరామర్శించి ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందించారు.












Click it and Unblock the Notifications