తెలంగాణ వ్యాఖ్యపై వెనక్కి తగ్గిన ప్రణబ్ ముఖర్జీ

కాగా, తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం చర్చల ప్రక్రియను మరింత వేగవంతం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్ర గవర్నర్ నరసింహన్ శుక్రవారమే ఢిల్లీకి చేరుకున్నారు. ఆయన శనివారం ప్రధాని మన్మోహన్ సింగ్తో పాటు అధిష్టానం పెద్దలతో భేటీ అవుతారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కూడా పార్టీ అధిష్టానం ఢిల్లీకి ఆహ్వానించింది. పార్టీ తరఫున పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్, ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదరం రాజనర్సింహ చర్చల్లో పాల్గొంటారు.
తెలంగాణపై నాలుగైదు రోజుల్లో సానుకూల ప్రకటన వస్తుందని తెలంగాణ కాంగ్రెసు నాయకులు భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోంది. దీనివల్లనే రైల్ రోకోను తెలంగాణ జెఎసి వాయిదా వేసుకున్నట్లు సమాచారం. మొత్తం మీద, తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం వేగంగా ముందుకు కదులుతోంది.












Click it and Unblock the Notifications