ముఖ్యమంత్రి కిరణ్ మార్పు అవాస్తవం: బొత్స

సకల జనుల సమ్మె ప్రభావం లేదని ఎవరూ అనడం లేదని తప్పకుండా సమ్మె ప్రభావం ఉంటుందన్నారు. సమ్మె ప్రభావం లేదని ఎవరైనా అంటే అది తప్పే అవుతుందన్నారు. కేంద్రం తెలంగాణ సమస్యను త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తోందని ఈ సమయంలో అందరూ కేంద్రానికి సహకరించాలని కోరారు. సమ్మె వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం లోగా సమ్మె ఆగిపోవాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. కాగా సాయంత్రం బొత్స హైదరాబాదు తిరిగి రానున్నారు.












Click it and Unblock the Notifications