వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముఖ్యమంత్రి కిరణ్ మార్పు అవాస్తవం: బొత్స

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kodandaram
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని మారుస్తారని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆదివారం న్యూఢిల్లీలో అన్నారు. కేంద్ర మంత్రి, రాష్ట్ర్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాదుతో భేటీ అనంతరం బొత్స మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ ప్రైవేటీకరణ వార్తల్లో కూడా ఎలాంటి నిజం లేదన్నారు. గాంధీ భవనంలో ఉదయం జరిగిన యువజన విభాగం సభ్యత్వ నమోదు కార్యక్రమంలో జరిగిన రసాభాసపై సమాచారం తెలుసుకుంటున్నానని పూర్తిగా తెలుసుకున్న తర్వాత స్పందిస్తానన్నారు.

సకల జనుల సమ్మె ప్రభావం లేదని ఎవరూ అనడం లేదని తప్పకుండా సమ్మె ప్రభావం ఉంటుందన్నారు. సమ్మె ప్రభావం లేదని ఎవరైనా అంటే అది తప్పే అవుతుందన్నారు. కేంద్రం తెలంగాణ సమస్యను త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తోందని ఈ సమయంలో అందరూ కేంద్రానికి సహకరించాలని కోరారు. సమ్మె వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం లోగా సమ్మె ఆగిపోవాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. కాగా సాయంత్రం బొత్స హైదరాబాదు తిరిగి రానున్నారు.

English summary
PCC chief Botsa Satyanarayana said today that CM Kiran Kumar Reddy change news is not true. He appealed Telangana employees to withdraw strike.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X