తెలంగాణ ఉద్యోగులతో ప్రభుత్వం చర్చలు విఫలం

Swamy Goud
హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగులతో ప్రభుత్వం జరిపిన చర్చలు బుధవారం విఫలమయ్యాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా సకల జనుల సమ్మెలో పాల్గొంటున్న ఉద్యోగులతో మంత్రివర్గం ఉపసంఘం బుధవారం చర్చలు జరిపినప్పటికీ అవి ఫలవంతం కాలేదు. చర్చల్లో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మంత్రులు దానం నాగేందర్, ముఖేష్ గౌడ్ తదితరులు ఉన్నారు. చర్చలు జరుతున్న సమయంలో అర్థాంతరంగా ఉద్యోగ సంఘాల నేతలు బయటకు వచ్చారు. స్వామి గౌడ్, విఠల్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు మీడియాతో మాట్లాడారు. ఓ వైపు ఉద్యోగులపై కేసులు పెడుతూ మరోవైపు చర్చలని పిలవడమేమిటని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తాము ఎప్పుడూ చర్చలకు సిద్ధమేనని అయితే ప్రభుత్వమే అందుకు సానుకూల వాతారవణం కల్పించడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం ఇష్టారీతిగా వ్యవహరిస్తోందన్నారు.

ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతున్నారో అర్థం కాకుండా ఉందన్నారు. 30 రోజుల నుండి సమ్మె చేస్తుంటే మంత్రులకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. సమ్మె విరమణ కోసం ప్రభుత్వం చర్చలు జరుపుతున్నట్లుగా కనిపించడం లేదన్నారు. తెలంగాణపై ప్రకటన వెలువడే వరకు సమ్మె కొనసాగుతుందన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షను కేంద్రానికి తెలియజేయాలన్నారు. చర్చలకు రావాలంటే ఉద్యోగులపై పెట్టిన కేసులు వెంటనే ఎత్తి వేయాలని, జివో 177 రద్దు చేయాలని, తెలంగాణపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలని, ఉద్యోగులపై హత్యాయత్నం చేసిన వారిపై కేసు పెట్టి చర్యలు తీసుకోవాలని, ఎస్మా రద్దు చేయాలని తదితర డిమాండ్లు ప్రభుత్వం ముందు పెట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+