వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అద్వానీ తెలంగాణ వ్యాఖ్యలపై సింఘ్వీ మండిపాటు

By Pratap
|
Google Oneindia TeluguNews

Abhishek Manu Singhvi
న్యూఢిల్లీ: తెలంగాణ సమస్యపై బిజెపి అగ్రనేత ఎల్‌కె అద్వానీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెసు అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణపై అంత ప్రేమ ఉంటే అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ఎందుకు ఇవ్వలేదో బిజెపి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయ లబ్ధి కోసమే అద్వానీ తెలంగాణ గురించి మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ విషయంలో బిజెపి గురించి, అద్వానీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని ఆయన అన్నారు. తెలంగాణ విషయంలో కాంగ్రెసును విమర్శించే అర్హత బిజెపికి, అద్వానీకి లేదని ఆయన అన్నారు.

తెలంగాణపై వ్యాఖ్యలతో సమస్యను జఠిలం చేయవద్దని ఆయన అద్వానీకి సూచించారు. ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు అద్వానీ ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలనేది అద్వానీ ప్రయత్నమని ఆయన అన్నారు. తెలంగాణ సమస్య పరిష్కారానికి సంయమనం అవసరమని ఆయన అన్నారు.

English summary
Congress spokesperson Abhisekh Manu Singhvi retaliated BJP leader LK Advani on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X