చంద్రబాబు తెలంగాణ పర్యటన ఊసు, కెసిఆర్‌ టార్గెట్

Chandrababu Naidu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును లక్ష్యం చేసుకోవడానికి ఇదే మంచి సందర్భమని భావిస్తున్నారు. పోలవరం టెండర్ల వ్యవహారాన్ని ప్రధానం చేసుకుంటూ ఆయన సమరం సాగించడానికి నిర్ణయించుకున్నారు. ఇదే సమయంలో తాను తెలంగాణలో పర్యటిస్తానంటూ ఓ బాణం వేశారు. పోలవరం టెండర్లను రద్దు చేయాలని రద్దు చేయాలని కోరుతూ ఆయన మంగళవారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టు టెండర్ కెసిఆర్‌కు చెందిన నమస్తే తెలంగాణ పత్రిక సహ భాగస్వామి లక్ష్మీరాజంకు దక్కడాన్ని చంద్రబాబు ఆయుధంగా మలుచుకున్నారు. దీనిపైనే తెలుగుదేశం తెలంగాణ నేతలు కెసిఆర్‌పై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. కాంగ్రెసు పార్టీ పెద్దలతో కుమ్మక్కయి టెండర్ కోసం తెలంగాణ ఉద్యమాన్ని కెసిఆర్ నట్టేట ముంచారని వారు విమర్శిస్తున్నారు.

ఫైళ్లు తారుమారు కాక ముందే పోలవరం ప్రాజెక్టు టెండర్ల ఫైలును శాసనసభ స్పీకర్ ముందు ఉంచాలని చంద్రబాబు ముఖ్యమంత్రిని కోరారు. ప్రస్తుత టెండర్‌ను రద్దు చేసి కొత్తగా టెండర్లు పిలవాలని ఆయన సూచించారు. టెండర్లను ఖరారు చేసే విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని ఆయన అన్నారు. అవినీతి కారణంగానే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరుగతోందని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టు టెండర్ల వ్యవహారాన్ని కెసిఆర్‌కు వ్యతిరేకంగా సంధించడానికి ఆయన ఇప్పటికే పూనుకున్నారు. అదే సమయంలో తాను నవంబర్‌లో తెలంగాణలో పర్యటిస్తానని ఓ ప్రచారాన్ని అమలులో పెట్టారు. నవంబర్ 2వ తేదీన చంద్రబాబు పర్యటన అనంతపురం జిల్లాతో ప్రారంభమై తెలంగాణలోకి ప్రవేశిస్తుందని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+