వైయస్‌ను ఆడిపోసుకున్న టిడిపి అధినేత చంద్రబాబు

Chandrababu Naidu
హైదరాబాద్: దీపావళి పర్వదినం రోజున కూడా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని ఆడిపోసుకున్నారు. ఫార్ములా వన్ రేసు హైదరాబాదుకు వచ్చి ఉంటే ఎంతో బాగుండేదని, అది రాకుండా వైయస్ రాజశేఖర రెడ్డి అడ్డుకున్నారని ఆయన విమర్శించారు. బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. మెట్రో రైలు రూపకర్తను కేసులు పెట్టి వైయస్ రాజశేఖర రెడ్డి వేధించారని ఆయన విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలోనే తెలంగాణ అభివృద్ధి చెందిందని, దీనిపై చర్చకు రావాలంటే ఎవరూ రావడం లేదని ఆయన అన్నారు. ఫార్ములా వన్ రేసు హైదరాబాదు వచ్చి ఉంటే ఉద్యోగావకాశాలు మెరుగు పడి ఉండేవని ఆయన అన్నారు.

కాంగ్రెసు పాలనలో గ్రామానికో అవినీతి నరకాసురుడు ఉన్నాడని ఆయన వ్యాఖ్యానించారు. అవినీతిని అంతమొందించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, దీంతో ప్రజలు ఏమీ కొనలేని దుస్థితిలో ఉన్నారని ఆయన అన్నారు. వచ్చే దీపావళికైనా ప్రజల జీవితాలు బాగుపడాలని కోరుకుంటున్నానని ఆయన అన్నారు. కాంగ్రెసు పాలనపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+