కెసిఆర్ తీరును తప్పు పట్టిన బిజెపి నేత కిషన్ రెడ్డి

రాష్ట్రంలో నెలకొన్న కరువుపై చర్చించేందుకు వెంటనే శాసనసభా సమావేశాలను ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆరు నెలలుగా శాసనసభా సమావేశాలను ఏర్పాటు చేయకపోవడం రాష్ట్రపతి పాలనను తలపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, కెసిఆర్ మాటల యుద్ధం చూస్తుంటే జుగుప్స కలుగుతోందని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టు టెండర్లను రద్దు చేసి, వ్యవహారంపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డిపై నేరారోపణలు రుజువైతే పార్టీ కఠినంగా వ్యవహరిస్తుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications