జగన్తో కలిస్తే భంగపాటే: కెసిఆర్ వ్యాఖ్యలపై యాష్కీ

తెలంగాణపై పార్టీ అధిష్టానం జాప్యం చేస్తున్న కారణంగానే ముగ్గురు శాసనసభ్యులు తమ పార్టీని వీడారని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శాసనసభ్యుడు కె. కేశవరావు అన్నారు. శాసనసభ్యులు కాంగ్రెసును వీడడం దురదృష్టకరమని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ముగ్గురు శాసనసభ్యులు తమ పార్టీలో చేరడంతో కెసిఆర్ అత్యుత్సాహంతో ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ శాసనసభ్యులను కట్టడి చేయడంలో తాను, మంత్రి కె. జానారెడ్డి విఫలమయ్యామని ఆయన అన్నారు. ముగ్గురు శాసనసభ్యులు వ్యక్తిగత ప్రయోజనాల కోసమే కాంగ్రెసును వీడారే గానీ తెలంగాణ కోసం కాదని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించడాన్ని ఆయన తప్పు పట్టారు. బొత్స సత్యనారాయణ కించపరిచేలా మాట్లాడారని ఆయన అన్నారు. తెలంగాణ కోసమే ముగ్గురు శాసనసభ్యులు కాంగ్రెసును వీడారని ఆయన అన్నారు.
రాజీనామాల వల్ల ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కూలినా నష్టం లేదని, వచ్చేది రాష్ట్రపతి పాలనే అని సీమాంధ్రకు చెందిన రాష్ట్ర మంత్రి టిజి వెంకటేష్ అన్నారు. తెలంగాణకు చెందిన ఎంత మంది రాజీనామా చేసినా నష్టం లేదని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. బలహీనపడిన తెలంగాణ ఉద్యమాన్ని తెర మీదికి తెచ్చేందుకే తెలంగాణ కాంగ్రెసు శాసనసభ్యులు రాజీనామాలు చేశారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications