వాళ్లే తిరిగి వస్తారు: తెలంగాణ ఎమ్మెల్యేలపై రాయపాటి

Rayapati Sambasiva Rao
గుంటూరు/ అనంతపురం: తమ పార్టీ తెలంగాణ ప్రాంత శాసనసభ్యుల రాజీనామాలను కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు తేలిగ్గా తీసుకున్నారు. తెలంగాణపై కేంద్రం నిర్ణయం ప్రకటించిన తర్వాత వాళ్లే తిరిగి పార్టీలోకి వస్తారని ఆయన అన్నారు. సమైక్యాంధ్ర సదస్సులో ఆయన ఆదివారం మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెసు పార్టీకి ఏ విధమైన నష్టం లేదని ఆయన అన్నారు. తెలంగాణ సకల జనుల సమ్మె వల్ల నష్టపోయింది తెలంగాణ ప్రాంత ప్రజలేనని ఆయన అన్నారు. కొందరు నాయకులు బెదిరింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు.

సీమాంధ్ర ప్రజల మనోభావాలే తనకు ప్రధానమని, తమకు వ్యక్తిగత ఎజెండా లేదని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమైక్యాంధ్ర ద్వారానే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం 2009 డిసెంబర్ 9వ తేదీన చేసిన ప్రకటన వల్లనే రాష్ట్రంలో ఆందోళనలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. ఒక ఓటు రెండు రాష్ట్రాలంటూ కాకినాడలో చేసిన తీర్మానాన్ని బిజెపి తెలంగాణ రాష్ట్రం ఇచ్చే విషయంలో అమలు చేయలేదని ఆయన అన్నారు.

తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు నమ్మదగ్గ నాయకుడు కారని సీమాంధ్రకు చెందిన రాష్ట్ర మంత్రి శైలజానాథ్ అనంతపురంలో అన్నారు. కుట్రలు, కుతంత్రాలతో శానససభ్యులను తీసుకుని పోవడమే కెసిఆర్ వ్యూహమని, దాని వల్ల తమకు నష్టమేమీ లేదని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. కెసిఆర్ దుష్ట ఆలోచనలకు శానససభ్యులు బలి కావద్దని ఆయన సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+