ప్రభుత్వ బలనిరూపణ అవసరం లేదు: గవర్నర్

Narasimhan
న్యూఢిల్లీ/ హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం శానససభలో బలాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం లేదని గవర్నర్ నరసింహన్ అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిందనే వ్యాఖ్యలు వస్తున్న నేపథ్యంలో ఆయన సోమవారం ఆ ప్రకటన చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి అవసరమైన బలం ఉందని ఆయన చెప్పారు. శాసనసభ్యుల రాజీనామాలు పెండింగులో ఉన్నాయని, ప్రభుత్వం మైనారిటీలో పడలేదని ఆయన అన్నారు. ఆయన కేంద్ర హోం మంత్రి పి. చిదంబరాన్ని కలిశారు. రాష్ట్రంలోని తాజా పరిస్థితిపై ఆయన చిదంబరానికి వివరించారు.

ముగ్గురు శానససభ్యులు పోయినంత మాత్రాన ప్రభుత్వం మైనారిటీలో ఎలా పడుతుందని గవర్నర్ అడిగారు. తాను చిదంబరానికి ఏ విధమైన నివేదిక ఇవ్వలేదని ఆయన చెప్పారు. పోలవరం ప్రాజెక్టుపై గిరిజనులకు సమస్యలుంటే పరిశీలిస్తామని ఆయన చెప్పారు. తమ ప్రభుత్వం మైనారిటీలో పడలేదని సీమాంధ్రకు చెందిన రాష్ట్ర మంత్రి శైలజానాథ్ అన్నారు. 2014 వరకు తమ ప్రభుత్వానికి ఢోకా లేదని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+