వైయస్ జగన్, కెసిఆర్ను కడిగేసిన రేవంత్ రెడ్డి

తమపై విమర్శలు చేసే వారిది రాజకీయ అజ్ఞానమన్నా కావాలి లేక బురదజల్లే యత్నమన్నా కావాలన్నారు. వచ్చే శీతాకాల సమావేశాల్లో టిడిపి కిరణ్ సర్కారుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెడుతుందని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసే దమ్ము మీకుందా స్పష్టం చేయాలన్నారు. వైయస్ హయాంలో పదిమంది శాసనసభ్యులను అమ్ముకున్న కెసిఆర్ తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముగ్గురిని అమ్ముకున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అమ్ముడు పోయిన వారిని మళ్లీ ఎందుకు తీసుకున్నారో స్పష్టం చేయాలన్నారు. కాంగ్రెసుకు అవసరమైనప్పుడల్లా కెసిఆర్ డబ్బులకు అమ్ముడుపోయి ఆదుకుంటాడని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఇతర పార్టీల నుండి టిఆర్ఎస్లోకి ప్రజాప్రతినిధులను చేర్పించుకొని అటునుండి కాంగ్రెసు, జగన్ పార్టీలోకి పంపిస్తారన్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టాలనే చిత్తశుద్ధి జగన్, కెసిఆర్కు ఉంటే వారే పడగొట్టవచ్చునన్నారు.
జగన్ 26 మంది, కెసిఆర్ 17 మంది ఎమ్మెల్యేలు కలిసి గవర్నర్ దగ్గర వెళ్లి పరేడ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాన్ని పడగొట్టాలనే చిత్తశుద్ధి లేదు కాబట్టే వారు వెనక్కి వెళుతున్నారన్నారు. వారిద్దరు కలిసి అవిశ్వాస తీర్మానం కూడా పెట్టవచ్చునన్నారు. ఈ సమావేశాలలో మేం అవిశ్వాస తీర్మానం పెడతాం అప్పుడు ప్రజలకు ఎవరు ఏమిటో తెలుస్తుందన్నారు. కాంట్రాక్టులు పొందడానికో, రాజకీయ ప్రయోజనాలకో శాసనసభ్యులను అమ్ముకొని సమస్యలను కెసిఆర్ పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. కెసిఆర్కు అవిశ్వాస తీర్మానం ఎప్పుడు పెడతారో కూడా తెలియదా అని ప్రశ్నించారు. కిరణ్ సర్కారు మైనార్టీలో పడిందని బలనిరూపణలు ఆదేశించాలని ఆయన గవర్నర్ నరసింహన్ను కోరారు.












Click it and Unblock the Notifications