వైయస్ జగన్ దుమ్ము దులిపిన ఆంధ్రజ్యోతి డైలీ

కాంగ్రెసు ప్రభుత్వం 64 ఎకరాల ఓబుళాపురం భూములను రామ్మోహన్ రెడ్డి తండ్రి రామచంద్రా రెడ్డికి లీజుకు ఇచ్చిందని, రామచంద్రా రెడ్డి మరణంతో ఆయన కుమారుడు రామ్మోహన్ రెడ్డి తెర మీదికి వచ్చారని, ఇదంతా కూడా కాంగ్రెసు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే జరిగిందని, చంద్రబాబు రామ్మోహన్ రెడ్డి లీజును రెన్యువల్ చేసిందని తెలిపింది. ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి లీజును బదిలీ చేసినప్పుడు ఆ ఒప్పందం 2004 డిసెంబర్ 13వరకు మాత్రమే వర్తిస్తుందని, అయితే దాన్ని 1997ను ప్రాతిపదికగా తీసుకుని వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం 20 ఏళ్ల పాటు లీజును పొడిగించిందని వివరించింది. గాలి జనార్దన్ రెడ్డి కంపెనీకి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఒకే రోజు 270 ఎకరాలను దారాదత్తం చేసిందని తెలిపింది. తేదీల వారీగా వ్యవహారం ఎలా నడిచిందో ఆంధ్రజ్యోతి వార్తాకథనం వివరించింది. జగన్ వాదనలో అసంబద్ధతను ఎత్తి చూపింది.












Click it and Unblock the Notifications