గంజాయి స్మగ్లర్‌ను సజీవ దహనం చేసిన ప్రత్యర్థులు

Vishakapatnam
విశాఖపట్నం: విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలో రమణ అనే గంజాయి స్మగ్లర్ దారుణ హత్యకు గురయ్యాడు. అతన్ని ప్రత్యర్థులు కిరోసిన్ పోసి నిప్పంటించి హత్య చేశారు. ఈ సంఘటన విశాపట్నం ఏజెన్సీ ప్రాంతంలోని రోలుగుంట మండలం బిపి పట్నం వద్ద శుక్రవారం అర్థరాత్రి సమయంలో జరిగింది. ఓ కేసులో కోర్టుకు హాజరై తిరిగి వస్తుండగా అతని ప్రత్యర్థులు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. ఆర్థిక లావాదేవీల్లో వచ్చిన గొడవలే ఈ హత్యకు కారణమని భావిస్తున్నారు.

కొంత కాలంగా రమణ లక్ష్మి అనే మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఆమెతో కలిసి రోలుగుంట నుంచి బైక్‌పై తిరిగి వస్తుండగా ప్రత్యర్థులు దాడి చేసి హత్య చేశారు. ఇనుప రాడ్లతో కొట్టి ఆ తర్వాత ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించి రమణను హత్య చేశారు. రమణపై గంజాయి స్మగ్లింగుకు సంబంధించిన కేసులు ఉన్నాయి. ఈ సంఘటన విశాఖ ఏజెన్సీలో తీవ్ర సంచలం సృష్టించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+