చేనేత ప్రతినిధులపై శంకరరావు వీరంగం, రసాభాస

చేనేత కార్మిక సంఘాల నేతలను ఆయన బ్రోకర్లుగా అభివర్ణించారు. తనను కలవడానికి వచ్చినప్పుడు ఆయన వారి పట్ట అమర్యాదగా ప్రవర్తిస్తూ బ్రోకర్లుగా అభివర్ణించారు. దీంతో గొడవ ప్రారంభమైంది. కార్మికులు ఆందోళనకు దిగారు. కాగా, తాను ఈ నెల 14వ తేదీన తెలంగాణపై ఎఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీని కలుస్తున్నట్లు ఆయన తెలిపారు. కోమటి రెడ్డి వెంకటరెడ్డి దీక్షా శిబిరానికి మంత్రి శంకరరావు వ్చచారు. ఆయనను అడ్డుకునేందుకు తెలంగాణవాదులు ప్రయత్నించారు. తాను మంత్రిగా ఇక్కడికి రాలేదని, వైద్యుడిగా వ్చచానని ఆయన చెప్పుకున్నారు. తెలంగాణ ఎంత ముఖ్యమో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రాణాలు కూడా అంతే ముఖ్యమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications