తెలంగాణపై ఈ నెలలోనే ప్రకటన, సిఎంగా డిఎస్?

తెలంగాణపై ప్రతికూల ప్రకటన చేసేందుకే ఈ ప్రాంతంలో పెద్ద యెత్తున బలగాలను మోహరించినట్లు చెబుతున్నారు. తెలంగాణకు ఇచ్చే ప్యాకేజీలో భాగంగా ఎమ్మెల్సీగా ఎన్నికైన డి. శ్రీనివాస్కు ముఖ్యమంత్రి పదవి అప్పగించే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. తెలంగాణలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై గవర్నర్, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు ఓ అంచనాకు వచ్చినట్లు చెబుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 97 కంపెనీల పోలీసు బలగాలున్నాయి. వీటిని ముఖ్యమైన విశ్వవిద్యాలయాల వద్ద, కాలేజీల వద్ద మోహరించనున్నారు. కరీంనగర్, వరంగల్, మహబూబ్నగర్ జిల్లాలకు తరలించనున్నారు.












Click it and Unblock the Notifications