వైయస్ జగన్పై తెలుగుదేశం పార్టీ నాయకుల ఫైర్

అక్రమాస్తులు, ఎమ్మార్ కుంభకోణఁ, ఒఎంసి అక్రమాల కేసుల్లో దోషిగా ుఉన్న జగన్ను సిబిఐ విఐపిలా చూడడం తగదని తెలుగుదేశం మరో నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. విచారణకు హాజరైన జగన్ను సిబిఐ అతిథిలా చూసిందని ఆయన శనివారం నెల్లూరులో మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు. విశ్వసనీయతకు మారు పేరుగా చెప్పుకునే జగన్ సిబిఐ ఎదుట అంతా అవాస్తవమే చెప్పారని ఆయన అన్నారు. తన అవినీతిని కప్పి పుచ్చుకునేందుకు జగన్ గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులోకి తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని లాగేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. బోఫోర్స్ కేసు మాదిరిగా కాకుండా జగన్పై ఉన్న కేసులను త్వరగా తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణపై కొండా లక్ష్మణ్ బాపూజీ చేపట్టిన దీక్షను విరమింపజేయాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications