జగనో మీరో తేల్చుకోండి: రఘువీరాకు టిడిపి నేతలు

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన రూ.1కి కిలో బియ్యంపై టిడిపి సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు హైదరాబాదులో తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. ప్రభుత్వం బియ్యం పథకం కేవలం ప్రచారం కోసమే ఉపయోగించుకుంటుందన్నారు. ఇచ్చే నాలుగు కిలోల బియ్యం పది రోజులు వచ్చినా మిగిలిన ఇరవై రోజులు అధిక ధర పెట్టి తినాల్సిందేనన్నారు. ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టకుండా కేవలం ప్రచార అర్భాటం కోసమే ప్రభుత్వం దీన్ని తీసుకు వచ్చిందన్నారు. తమిళనాడులో అక్కడి ముఖ్యమంత్రి జయలలిత ఇరవై కిలోల బియ్యం ఇస్తుందని చెప్పారు.












Click it and Unblock the Notifications