బాబు ఆస్తులను లెక్కించడం సాధ్యం కాదు: శైలజానాథ్

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో కాంగ్రెసు కుమ్మక్కయి వైయస్ విజయమ్మతో చంద్రబాబుపై పిటిషన్ వేయించిందని తెలుగుదేశం పార్టీ నాయకుడు యనమల రామకృష్ణుడు చేసిన ఆరోపణను కొండ్రు మురళి ఖండించారు. ఆ వ్యవహారంలోకి కాంగ్రెసును లాగవద్దని ఆయన తెలుగుదేశం నాయకులకు సూచించారు. కేసుల నుంచి బయటపడడానికి చంద్రబాబు ప్రయత్నించాలి తప్ప తమను ఆడిపోసుకోవడం సరి కాదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రాన్ని గడ్డు పరిస్థితి నుంచి గట్టెక్కించారని, నీతివంతమైన పాలనను అందిస్తున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీ జగన్తో కుమ్మక్కయిందనే తెలుగుదేశం పార్టీ నాయకుల విమర్శల్లో నిజం లేదని రుద్రరాజు పద్మరాజు అన్నారు.
చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి ఆస్తులపై కేసుల్లో తమకు సంబంధం లేదని కాంగ్రెసు అధికార ప్రతినిధి తులసిరెడ్డి విడిగా మీడియా ప్రతినిధులతో అన్నారు. చంద్రబాబు ఆస్తులపై విచారణకు తెలుగుదేశం పార్టీ ఎందుకు భయపడుతోందో అర్థం కావడం లేదని ఆయన అన్నారు. చంద్రబాబు, వైయస్ జగన్ విచారణలకు సిద్ధపడి నిజాయితీని నిరూపించుకోవాలని ఆయన అన్నారు.
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications