జగన్, తెలంగాణపై శంకరరావు సంచలన వ్యాఖ్యలు

P Shankar Rao
నిజామాబాద్: తెలంగాణ కోసం అవసరమైతే మానవ బాంబుగా మారడానికి కూడా సిద్ధమని చేనేత, జౌళీ శాఖ మంత్రి శంకరరావు సోమవారం నిజామాబాద్ జిల్లాలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఆయన విజ్ఞప్తి చేశారు. మరో 12 రోజుల్లో తెలంగాణపై కేంద్రం సానుకూల ప్రకటన చేస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. 97 ఏళ్ల వయసులోనూ కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ కోసం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పటికైనా కాంగ్రెసు వ్యక్తే అన్నారు. గతంలో తాను మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మోపిదేవి వెంకటరమణలపై చేసిన అవినీతి ఆరోపణలను రుజువు చేస్తానన్నారు. తెలంగాణలో ఉన్న నిజాం చక్కెర కర్మాగారాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని, దీనిపై ఇప్పటికే తాను సంతకం చేశానని కూడా చెప్పారు. రాబోయే ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ కాంగ్రెసే గెలిచి రాహుల్ ప్రధానమంత్రి అవుతారని శంకర్‌రావు జోస్యం చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+