కెవిపి పాత్రపై ప్రభాకర్ రెడ్డి నుంచి ఆరా తీసిన సిబిఐ

KVP Ramachandra Rao
హైదరాబాద్: వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో కార్యదర్శిగా పనిచేసిన రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ప్రభాకర్ రెడ్డి గనుల వ్యవహారం తనకేమీ తెలియదని సిబిఐ విచారణలో చెప్పినట్లు సమాచారం. గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో ఆయనను సిబిఐ అధికారులు మంగళవారం విచారించారు. ఆయన ముఖ్యమంత్రి కార్యాలయంలో గనుల శాఖను చూసేవారు. గనుల శాఖకు సంబంధించిన కొన్ని నిర్ణయాల్లో అప్పట్లో ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రత్యేక కార్యదర్శిగా పనిచేసిన ఐఎఎస్ అధికారి జోక్యం చేసుకునేవారని ప్రభాకర్ రెడ్డి సిబిఐకి చెప్పినట్లు తెలుస్తోంది. వాటి సమాచారం కూడా తనకు అందేది కాదని ఆయన చెప్పినట్లు సమాచారం.

వైయస్ రాజశేఖర రెడ్డి నిర్వహించే సమావేశాల్లో అప్పటి ప్రభుత్వ సలహాదారు కెవిపి రామచందర్ రావు పాల్గొనేవారా, ప్రభుత్వ నిర్ణయాల్లో కెవిపి పాత్ర ఏమిటి అని సిబిఐ అధికారులు ప్రభాకర్ రెడ్డిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. వైయస్ ఆదేశాలకు అనుగుణంగానే నిర్ణయాలు ఉండేవని, ఆయన ఆదేశాలను పేషీ అధికారులు అమలు చేసేవారని, శాఖలకు కూడా ఆదేశాలు జారీ అయ్యేవని ప్రభాకర్ రెడ్డి వివరించినట్లు తెలుస్తోంది. పేరుకు గనుల శాఖ తన పరిధిలో ఉన్నా గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఒఎంసి సహా పలు కీలకమైన నిర్ణయాలు తనకు తెలియకుండానే జరిగిపోయాయని ఆయన చెప్పారు. ఓఎంసి గురించి ఐఎఎస్ అధికారులు రాజగోపాల్, శ్రీలక్ష్మి తన వద్దకు వచ్చేవారు కారని ఆయన చెప్పారు. గనుల అనుమతుల గురించి దరఖాస్తుదారులు తన వద్దకు వచ్చేవారు కారని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+