సదస్సులో మంత్రులు సిఎం పరువు తీశారు: దేవేందర్

తాను ముఖ్యమంత్రిని అని చెప్పుకోవడానికే కిరణ్ ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లుగా కనిపిస్తోందన్నారు. ప్రజా సమస్యల కోసం పెట్టినట్లుగా కనిపించడం లేదని విమర్శించారు. ప్రభుత్వం పథకాలపై మంత్రులకు సరైన అవగాహన లేదని ఆరోపించారు. సకల జనుల సమ్మె అయిపోయినా విద్యుత్ కోతల ఎందుకు కొనసాగుతుందో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని పాలించే నైతిక హక్కు ప్రభుత్వం కోల్పోయిందన్నారు.
తెలుగుదేశం పార్టీ రైతుల సమస్యల గురించి పోరాటం చేస్తుంటే తెలంగాణ రాష్ట్ర సమితి అడ్డుకోవడం విడ్డూరమని మరో నేత తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. ప్రజా సమస్యలపై టిఆర్ఎస్కు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై మాట్లాడే ధైర్యం లేదన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రచ్చబండను ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications