ఇష్టసఖికి షాకిచ్చిన జయలలిత, పార్టీ నుండి సస్పెండ్

ఐఏఎస్ అధికారులు శశికళకే నేరుగా ఫిర్యాదు చేయడం, రాజ్యాంగేతర శక్తిగా ఎదగడం జీర్ణించుకోలేని జయలలిత ఆమెను సస్పెండ్ చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న కేసులో జయతో పాటు శశికళ ప్రధాన నిందితురాలు. కాగా శశికళపై వేటు వేయడాన్ని ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి. అక్రమాస్తుల కేసు నుండి బయటపడేందుకే జయ వేసిన ఎత్తుగడ అని, శశికళపై ఆస్తుల కేసు మోపేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.












Click it and Unblock the Notifications