హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎవరికి ఉరేస్తారో తెల్చుకుందాం, రా: హరీష్ రావు

By Pratap
|
Google Oneindia TeluguNews

Harish Rao
హైదరాబాద్: ప్రజలు ఎవరికి ఉరేస్తారో తేల్చుకోవడానికి ప్రజా క్షేత్రంలోకి రావాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు హరీష్ రావు తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడికి, నాయకులకు సవాల్ చేశారు. తమ పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై తెలుగుదేశం తెలంగాణ ప్రాంత నాయకులు ఎర్రబెల్లి దయాకర్ రావు, మోత్కుపల్లి నర్సింహులు చేసిన వ్యాఖ్యలపై ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబు తెలంగాణకు మోసం చేశాడని ఆత్మహత్యలు చేసుకున్న యువకులు సూసైడ్ నోట్స్‌లో రాశారని ఆయన చెప్పారు. చంద్రబాబుపై ఆరోపణలు చేస్తూ రాసిన ఉన్న సూసైడ్ నోట్స్‌లోని కొన్ని విషయాలను ఆయన చదివి వినిపించారు. తాము 700 మంది సూసైడ్స్ నోట్లను కూడా బయటపెడతామని ఆయన హెచ్చరించారు. తెలుగుదేశం, కాంగ్రెసు మోసపూరిత వైఖరి వల్ల యువకులు, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన అన్నారు.

ఉరేసుకోవాల్సి వస్తే చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ తెలంగాణ నాయకులు ఉరేసుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో జరిగిన 12 స్థానాల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కలేదని ఆయన గుర్తు చేశారు. తెలంగాణకు వ్యతిరేకంగా ఎన్టీఆర్ ట్రస్టు నుంచి చంద్రబాబు రాజకీయం నడిపినప్పుడే ఎర్రబెల్లి దయాకర్ రావు ఉరేసుకోవాల్సి ఉండిందని ఆయన అన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా తెలుగుదేశం సీమాంధ్ర నాయకులు పయ్యావుల కేశవ్, కోడెల శివప్రసాద్, దేవినేని ఉమామహేశ్వర రావు సమైక్యాంధ్ర ఉద్యమాన్ని సృష్టించినప్పుడే తెలుగుదేశం తెలంగాణ నాయకులు ఉరేసుకోవాల్సి ఉండిందని ఆయన అన్నారు. శాసనసభలో తెలంగాణ పదాన్నిచంద్రబాబు నిషేధించినప్పుడు మోత్కుపల్లి నర్సింహులు ఏం చేశారని ఆయన అడిగారు.

కేంద్ర హోం మంత్రి ప్రకటన చేసినప్పుడు తెలంగాణను అడ్డుకున్నది చంద్రబాబు నాయుడేనని, రాత్రికి రాత్రి ఎలా ప్రకటన చేస్తారని అడిగారని, తమిళనాడుకు చెందిన చిదంబరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చీల్చడానికి కుట్ర చేశారని ఆరోపించారని, ఎన్టీఆర్ ట్రస్టు భవనం నుంచి కృత్రిమ సమైక్యాంధ్ర ఉద్యమాన్ని సృష్టించారని ఆయన అన్నారు. వచ్చిన తెలంగాణ చంద్రబాబు వల్లనే చేజారిందని ఆయన అన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా చంద్రబాబు కిరణ్ కుమార్ రెడ్డి, రోశయ్య, చిరంజీవిలతో కలిసి కుట్ర చేశారని ఆయన ఆరోపించారు. తెలంగాణపై ఎవరికైనా ఉరి వేయాల్సి వస్తే మొదట చంద్రబాబుకు వేయాలని ఆయన వ్యాఖ్యానించారు.

English summary
TRS MLA Harish rao has countered TDP Telangana leaders Errabelli Dayakar Rao and Mothkupalli Narasimhulu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X