వైయస్ వారసత్వం సమాధి, కిరణ్ కుమార్ రెడ్డికి స్వేచ్ఛ

Kiran Kumar Reddy
హైదరాబాద్: ప్రభుత్వ పాలనలో వైయస్ రాజశేఖర రెడ్డి వారసత్వాన్ని సమాధి చేసి, తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నారు. ఇందుకు ఆయనకు కాంగ్రెసు అధిష్టానం నుంచి పూర్తి స్వేచ్ఛ లభించినట్లు సమాచారం. ముఖ్యమంత్రికి మరింత స్వేచ్ఛనిచ్చి, 2014 ఎన్నికలకు సంసిద్ధం కావడానికి తగిన ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు చెబుతున్నారు. పూర్తి స్థాయిలో తనకు అనుకూలమైన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కూడా ముఖ్యమంత్రికి స్వేచ్ఛనిచ్చినట్లు చెబుతున్నారు. కొత్త ఏడాదిలో ఆయన కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుంటారని అంటున్నారు. ఫిబ్రవరిలో బడ్జెట్ ప్రతిపాదనకు ముందు కొత్త మంత్రి వర్గం ఏర్పాటవుతుందని చెబుతున్నారు.

తనకు ఇబ్బందులు కలిగిస్తున్న మంత్రులకు ఉద్వాసన పలకడంతో పాటు వైయస్ ముద్ర లేని మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలనేది ముఖ్యమంత్రి ఆలోచనగా చెబుతున్నారు. రెండు రూపాయలకు కిలో బియ్యం, జలయజ్ఞం వంటి పథకాలను రూపాయికి కిలో బియ్యం, జలప్రభ వంటి పథకాలుగా మార్చేసి తన పథకాలుగా ప్రచారం చేసుకోవడంలో కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పటికే కొంత ఫలితం సాధించారని అంటన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ప్రమాదం కూడా పూర్తిగా తొలగిపోయినట్లేనని అంటున్నారు. అందుకు అనుగుణంగానే పార్టీ సమన్వయ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

తెలంగాణ తలనొప్పి కూడా దాదాపుగా సమసిపోయినట్లేనని చెబుతున్నారు. సమన్వయ కమిటీలో ఉన్న కావూరి సాంబశివరావు, చిరంజీవి సమైక్యవాదులు కాగా, డి. శ్రీనివాస్, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, షబ్బీర్ అలీ తెలంగాణ పేరుతో సమస్య సృష్టించే నాయకులు కారు. కాగా, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతోనే కాస్తా తలనొప్పి ఉంటుందని భావిస్తున్నారు. అయితే, కమిటీ చైర్మన్ హోదాలో గులాం నబీ ఆజాద్ ఎప్పటికప్పుడు బొత్సను కట్టడి చేస్తారని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+