సబితా ఇంద్రారెడ్డిపై మంత్రి శంకరన్న ప్రత్యక్ష వార్

హైదరాబాదు సమీపంలోని ఎన్టీఆర్ నగర్లో అమాయకులపై, వృద్ధులపై దాడులు చేశారని ఆయన ఆరోపించారు. దాడులు జరిగి చాలా రోజులైనా చర్యలు తీసుకోలేదని ఆయన అన్నారు. హోం శాఖలో ఒకే సామాజిక వర్గానికి చెందినవారున్నారని ఆయన అన్నారు. మంత్రి శంకరరావుపై దాడికి నిరసనగా ఈ నెల 27వ తేదీన ఎల్పీ నగర్లో దళిత గర్జన నిర్వహించనున్నట్లు ఎమ్మార్పీయస్ నేత మందకృష్ణ మాదిగ చెప్పారు. సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తిక రెడ్డి భూకబ్జాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. కార్తిక్ రెడ్డిపై, శాససభ్యుడు సుధీర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications