కిరణ్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన వైయస్ జగన్

YS Jagan
కడప: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. రైతులను పట్టించుకోవడం లేదని ఆయన ధ్వజమెత్తారు. ఆయన శనివారం కడప జిల్లాలో పర్యటించారు. రైతు సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆయన అన్నారు. రైతులకు భరోసా ఇవ్వని ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపినా తప్పు లేదని ఆయన విరుచుకుపడ్డారు. కడప జిల్లా మైదుకూరు మండలం కేశలింగాయపల్లి గ్రామంలో ానయ ఉల్లి పంటను పరిశీలించారు.

రాష్ట్రంలో ప్రభుత్వం ఉందో, లేదో అర్థం కాని పరిస్థితిలో రైతు ఉన్నాడని ఆయన అన్నారు. పది నెలలు వ్యవసాయ శాఖకు మంత్రి లేడని, వ్యవసాయ విశ్వవిద్యాలయానికి వైస్ చాన్సలర్‌ను నియమించలేదని, ఇంతటి దుస్థితిలో ప్రభుత్వం ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అంతకు ముందు వైయస్ జగన్ పులివెందులలోని వైయస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. వైయస్సార్ కాంగ్రెసు గౌరవాధ్యక్షురాలు, శానససభ్యురాలు వైయస్ విజయమ్మ కూడా వైయస్సార్ సమాధి వద్ద నివాళులు అర్పించారు. ఆమె శనివారం ఉదయం ఇడుపులపాయకు చేరుకున్నారు. వైయస్ విజయమ్మ కోడలు భారతి కూడా వైయస్సార్‌కు నివాళులు అర్పించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+