యుపి సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్

ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు కూడా మార్చి 4వ తేదీన జరుగుతుంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి శనివారం నుంచే అమలులోకి వస్తుంది. ఐదు రాష్ట్రాల్లోనూ ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాలను (ఇవిఎంలను) వాడుతారు. స్వేచ్ఛగా, నిజాయితీగా ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఉప ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల కమిషనర్ ఖురేషీ ప్రకటించలేదు. ఆంధ్రప్రదేశ్లోని ఏడు శాసనసభా స్థానాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోని ఉప ఎన్నికల విషయంలో కసరత్తు చేయాల్సిన అవసరం ఉందని ఖురేషీ చెప్పారు. ఎన్నికల సందర్భంగా ఫిర్యాదు చేయడానికి కాల్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications