జగన్ పార్టీపై ఆజాద్ ఆరా, తెలంగాణ జాప్యంపై వ్యాఖ్య

తెలంగాణ మంత్రులు ఆజాద్ను వేరుగా కలిసి తెలంగాణకు సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అందుకు ఆజాద్, తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయడంలో జరుగుతున్న ఆలస్యానికి కారణం మీకు, నాకు తెలుసని, ప్రస్తుతం ఎన్నికల ఉన్న దృష్ట్యా ఆ ప్రకటన ప్రభావం వాటిపై పడే అవకాశముందని వారితో అన్నారు. అయినా తెలంగాణ అంశంపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీతో మాట్లాడి ఆ తర్వాత తెలంగాణ నేతలతో సంప్రదింపులు జరుపుతానని వివరించారు. ఆలస్యమైనప్పటికీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని మంత్రులు అంటే ఆయన నవ్వి ఊరుకున్నారు.












Click it and Unblock the Notifications