వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మళ్లీ దాసరి ఉదయం డైలీ, మే 4న పునరుద్ధరణ?
పార్టీకి తన సహాయసహకారాలు, అండదండలు ఉంటాయని, పదవి ఉన్నా లేకపోయినా పార్టీ శ్రేయస్సే తనకు ముఖ్యమని దాసరి నారాయణ రావు చెప్పుకోవడానికే సోనియా గాంధీకి మూడు పేజీల లేఖ రాసినట్లు చెబుతున్నారు. పార్టీలో గ్రూపిజాన్ని పోషిస్తున్నవారిని అడ్డుకోవాలని ఆయన సోనియా గాంధీకి తన లేఖలో సూచించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వాన్ని బలహీనపరచవద్దని ఆయన సూచించారు. కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వాన్ని బలహీనపరిచేందుకు కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించినట్లు సమాచారం.
రాజ్యసభ సభ్యుడిగా ఆయన పదవీ కాలం మార్చితో ముగుస్తోంది. ఇది వరకు ఓసారి ఆయన రాజ్యసభ సభ్యత్వం పొడిగించారు. ఈసారి పొడిగిస్తారా, లేదా అనేది అనుమానంగానే ఉంది. ఈ నేపథ్యంలో తిరిగి పార్టీ క్రియాశీలక పాత్ర పోషించడానికి ఆయన ముందుకు వచ్చినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Comments
English summary
It is said that well noted producer and director Dasari Narayana Rao has decided to revive his Telugu daily Udayam.
Story first published: Friday, January 13, 2012, 14:53 [IST]