వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మా పతంగి ముందు టిడిపి పతంగి నిలువదు: హరీష్

By Srinivas
|
Google Oneindia TeluguNews

harish rao
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి పతంగి ముందు తెలుగుదేశం పార్టీ పతంగి నిలువదని టిఆర్ఎస్ సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు ఆదివారం అన్నారు. టిడిపి తెగిన గాలి పటం అన్నారు. టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు యాత్రలో చిత్తశుద్ధి లేదన్నారు. ఆయన యాత్రలు, పర్యటనలు చేసినంత మాత్రాన ఎవరూ నమ్మరన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు అన్నింటినీ ఆంధ్రోళ్లకే కట్టబెట్టే కుట్ర జరుగుతోందన్నారు. ఉద్యమంలో పాల్గొన్న తెలంగాణ విద్యార్థులపై కేసులు ఎత్తివేయకుండా ఉద్యోగాలు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. కేసులు ఎత్తివేస్తామని హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి హామీ ఇచ్చిందని, అయినప్పటికీ అవి ఇప్పటి వరకు నెరవేరలేదన్నారు. ఎంతమంది విద్యార్థులపై కేసులు ఎత్తివేశారో ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు.

విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలని కాంగ్రెసు పార్లమెంటు సభ్యులే ఆందోళన చేశారని గుర్తు చేశారు. ఎంపీలు విద్యార్థుల కేసు ఎత్తివేత కోసం ఉద్యమించాలని సూచించారు. దేశద్రోహం కేసులు పెట్టడం వల్ల తెలంగాణ విద్యార్థులకు కోర్టుల చుట్టూ తిరగడానికే సమయం సరిపోతోందన్నారు. కేసుల ఎత్తివేతపై కేంద్రహోంమంత్రి చిదంబరాన్ని త్వరలో కలుస్తామని చెప్పారు. కేసులు ఎత్తి వేసే వరకు ప్రభుత్వం నోటిఫికేషన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సంక్రాంతి ఉత్సవాల సందర్భంగా కోడిపందాలకు అనుమతి ఉందో లేదో ప్రభుత్వం స్పష్టం చేయాలన్నారు.

English summary
TRS MLA Harish Rao blamed TDP and 
 
 party chief Nara Chandrababu Naidu. He 
 
 demanded government to withdraw cases 
 
 against Telangana students who were 
 
 participated in agitation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X