చిరంజీవికి మళ్లీ నిరీక్షణే, విస్తరణ 23న జరిగే ఛాన్స్

Kiran Kumar Reddy
హైదరాబాద్: తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి వర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు, శాసనమండలి సభ్యుడు సి.రామచంద్రయ్యలు కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లో చేరడానికి అనుకున్న దానికంటే మరో నాలుగు రోజులు ఎక్కువగా ఎదురుచూసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నెల 19వ తేదిన ఉదయం 11.45 గంటలకు కిరణ్ కేబినెట్లో వారు చేరతారనే వార్తలు జోరుగా వచ్చాయి. అయితే 19వ తేదిన కూడా విస్తరణ జరిగే అవకాశాలు కనిపించడం లేదు. దానిని మరో నాలుగు రోజులకు వాయిదా వేయనున్నారని సమాచారం. ఈ నెల 23వ తేదిన విస్తరణ జరిగే ఛాన్స్ ఉందని సమాచారం. మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రి కిరణ్ ఢిల్లీ వెళుతున్న విషయం తెలిసిందే. మొదట అనుకున్న తేదికి ఎక్కువ సమయం ఉన్నందున, ఈ కాస్త వ్యవధిలో విస్తరణ అయినా పునర్వ్యవస్థీకరణ అయినా కష్టమని భావించి 23కు వాయిదా వేశారని సమాచారం.

బుధవారం ఉదయం గవర్నర్ నరసింహన్ ఢిల్లీ వెళ్లనున్నారు. మరోవైపు చిరంజీవితో ఆ పార్టీ నేత గంటా శ్రీనివాస రావు మధ్యాహ్నం భేటీ అయ్యారు. మంత్రివర్గ విస్తరణపై వారి మధ్య చర్చకు వచ్చినట్లుగా సమాచారం. ఉభయ గోదావరి జిల్లాల ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యేలు కూడా చిరంజీవిని కలవనున్నారు. కాగా అధిష్టానం కేవలం చిరంజీవి వర్గం నేతలతో విస్తరణకే గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా పునర్వ్యవస్థీకరణ కోరేందుకు కిరణ్ ఢిల్లీ వెళుతున్నట్లుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+