చిరు ఎమ్మెల్సీకి కౌంటర్: అధిష్టానానికి ఎమ్మెల్సీల లేఖ

తెలంగాణ ప్రాంతం నుంచి కూడా ఎమ్మెల్సీలకు కూడా మంత్రి పదవులు ఇవ్వాలని వారు కోరారు. ఇంద్రసేనా రెడ్డి, భానుప్రసాద్, జగదీశ్వర్ రెడ్డి, భూపాల్ రెడ్డి, మాకం అధిష్టానానికి లేఖ రాసినవారిలో ఉన్నారు. పలువురు ఎమ్మెల్సీలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కూడా కలిశారు. తమ లేఖను ఎమ్మెల్సీలు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపించారు. ముప్పయేళ్లుగా పార్టీకి సేవ చేస్తున్న ఎమ్మెల్సీలను పట్టించుకోవాలని వారు కోరారు. కాగా, మంత్రి వర్గంలో తెలంగాణవారికి ప్రాతినిధ్యం కల్పించాలని శాసనసభ్యుడు గండ్ర వెంకట రమణా రెడ్డి అన్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే మంత్రి వర్గ విస్తరణకు మరోసారి బ్రేక్ పడుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.












Click it and Unblock the Notifications