వైయస్పై వ్యాఖ్యలను సమర్థించుకున్న చంద్రబాబు

తన పోరాటం వ్యక్తులపై కాదని, తన పోరాటం ప్రజా వ్యతిరేక విధానాలపైనే అని ఆయన చెప్పారు. రాష్ట్రాన్ని వైయస్ రాజశేఖర రెడ్డి దోచుకుని నాశనం చేశారని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డితో కుమ్మక్కయ్యారని ఆయన అన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పోలవరం టెండర్ల విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో కుమ్మక్కయ్యారని ఆయన విమర్శించారు. రెండేళ్లు కూడా పార్టీని నడపలేదని చిరంజీవి ప్రజలకు ఎలా సేవ చేయగలరని ఆయన అన్నారు. పన్నుల రూపంలో ప్రభుత్వం ప్రజల రక్తం తాగుతోందని ఆయన అన్నారు. వస్త్రవ్యాపారుల ఆందోళనకు తమ మద్దతు ఉంటుందని ఆయన చెప్పారు. మంత్రి పదవులు, శాఖల కోసం కాంగ్రెసులో కమ్ములాటలు చోటు చేసుకున్నాయని ఆయన అన్నారు. తమ 9 ఏళ్ల పాలనలో ఒక్క ఎకరం కూడా అన్యాక్రాంతం కాకుండా కాపాడామని, కాంగ్రెసు అధికారంలోకి రాగానే భూములను అమ్ముకుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications