సరైన సమయంలో ఒత్తిడి పెట్టలేదు: తెలంగాణపై కెకె

K Keshav Rao
న్యూఢిల్లీ/ హైదరాబాద్: తెలంగాణ సమస్యపై తమ పార్టీ పార్లమెంటు సభ్యులు సరైన సమయంలో ఒత్తిడి పెట్టలేకపోయారని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు కె. కేశవరావు అన్నారు. తెలంగాణపై తమది రాజీ లేని పోరాటమని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణపై పార్లమెంటు సమావేశాల్లోగా సానుకూల ప్రకటన రావాలని ఆయన అన్నారు. చర్చల ద్వారానే తెలంగాణ సమస్య పరిష్కారమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. పి. శంకరరావును మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయడం తప్పు అని ఆయన అన్నారు. శంకరరావుతో పార్టీ అధిష్టానం మాట్లాడి ఉంటే బాగుండేదని ఆయన అన్నారు.

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఎక్కడో లోపం జరిగిందని, లోపాలను సరిదిద్దుకుంటామని ఆయన చెప్పారు. త్వరలో తమ పార్టీ తెలంగాణ పార్లమెంటు సభ్యులం సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకుంటామని ఆయన చెప్పారు. తెలంగాణ కోసం ఆంధ్రా నేతలతోనూ చర్చిస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ ఉద్యమం వివాదాలకు దారితీయడం బాధాకరమని ఆయన చెప్పారు. తెలంగాణ ఇవ్వకపోతే తాము కొట్టుకుపోతామని ఆయన అన్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ పోటీ చేయడం వ్యర్థమని ఆయన అన్నారు.

ఎన్ని డిఆర్‌సి సమావేశాలు జరిగినా ఫలితం లేదని, హైదరాబాదు సమస్యలు పరిష్కారం అయ్యేట్లు లేవని కాంగ్రెసు పార్టీ మరో పార్లమెంటు సభ్యుడు వి. హనుమంతరావు అన్నారు. సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. ప్రజల్లోకి వెళ్తే ఇబ్బందులు ఎదరువుతున్నాయని, సమస్యలు పరిష్కారం కాకపోవడమే అందుకు కారణమని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+