వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సరైన సమయంలో ఒత్తిడి పెట్టలేదు: తెలంగాణపై కెకె

By Pratap
|
Google Oneindia TeluguNews

K Keshav Rao
న్యూఢిల్లీ/ హైదరాబాద్: తెలంగాణ సమస్యపై తమ పార్టీ పార్లమెంటు సభ్యులు సరైన సమయంలో ఒత్తిడి పెట్టలేకపోయారని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు కె. కేశవరావు అన్నారు. తెలంగాణపై తమది రాజీ లేని పోరాటమని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణపై పార్లమెంటు సమావేశాల్లోగా సానుకూల ప్రకటన రావాలని ఆయన అన్నారు. చర్చల ద్వారానే తెలంగాణ సమస్య పరిష్కారమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. పి. శంకరరావును మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయడం తప్పు అని ఆయన అన్నారు. శంకరరావుతో పార్టీ అధిష్టానం మాట్లాడి ఉంటే బాగుండేదని ఆయన అన్నారు.

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఎక్కడో లోపం జరిగిందని, లోపాలను సరిదిద్దుకుంటామని ఆయన చెప్పారు. త్వరలో తమ పార్టీ తెలంగాణ పార్లమెంటు సభ్యులం సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకుంటామని ఆయన చెప్పారు. తెలంగాణ కోసం ఆంధ్రా నేతలతోనూ చర్చిస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ ఉద్యమం వివాదాలకు దారితీయడం బాధాకరమని ఆయన చెప్పారు. తెలంగాణ ఇవ్వకపోతే తాము కొట్టుకుపోతామని ఆయన అన్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ పోటీ చేయడం వ్యర్థమని ఆయన అన్నారు.

ఎన్ని డిఆర్‌సి సమావేశాలు జరిగినా ఫలితం లేదని, హైదరాబాదు సమస్యలు పరిష్కారం అయ్యేట్లు లేవని కాంగ్రెసు పార్టీ మరో పార్లమెంటు సభ్యుడు వి. హనుమంతరావు అన్నారు. సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. ప్రజల్లోకి వెళ్తే ఇబ్బందులు ఎదరువుతున్నాయని, సమస్యలు పరిష్కారం కాకపోవడమే అందుకు కారణమని ఆయన అన్నారు.

English summary
Congress Telangana MP K Keshav Rao said that they are failed to put pressure at appropriate time on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X