శంకరరావు ఉద్వాసన సరైందే, మారనందుకే: శైలజానాథ్

మంత్రి వర్గంలో ఎనిమిది మంది దళితులు ఉండాలని తాము మొదటి నుంచీ పోరాడుతున్నామని, అందుకు పోరాటం సాగిస్తామని ఆయన చెప్పారు. మంత్రివర్గం సమిష్టి నిర్ణయాలు తీసుకుంటుందని, ఆ సమిష్టి నిర్ణయాలే ప్రభుత్వ విధానాలుగా ముందుకు వస్తాయని, ఇటువంటి స్థితిలో సమిష్టి బాధ్యతను తీసుకోకపోవడం సరి కాదని ఆయన అన్నారు. శంకరరావు పదవి పోవడం స్వయం కృతాపరాధమేనని కొండ్రు మురళి అన్నారు. శాఖల మార్పులు చేర్పులు కాంగ్రెసు అంతర్గత వ్యవహారమని శైలజానాథ్ అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో తీసుకున్న నిర్ణయాలకు మంత్రులు సమిష్టి బాధ్యత వహిస్తారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications