ఐఏఎస్‌‍ల ఇష్యూ: ఏకీభవించిన బొత్స, ఉండవల్లి ఫైర్

Bosta Satyanarayan-Rayapati Sambhasiva Rao- Undavalli Arun Kumar
హైదరాబాద్: సిబిఐ ఐఏఎస్ అధికారులను లక్ష్యంగా చేసుకొని దర్యాఫ్తు చేస్తోందని, పెద్ద చేపలను వదిలి చిన్న చేపలను టార్గెట్ చేయడమేమిటని, దీనిపై చర్యలు తీసుకోవాలని పలువురు ఐఏఎస్ అధికారులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసినప్పటి నుండి రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుందనే చెప్పవచ్చు. తమను సిబిఐ టార్గెట్ చేస్తుందన్న ఐఏఎస్ అధికారులపై నేతలు వివిధ రకాలుగా స్పందించారు. కాంగ్రెసు నేతలు దాదాపు అందరూ అధికారుల తీరుపై మండిపడ్డారు. రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ విజయవాడలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రాజకీయ నేతలంటే ప్రజల్లో ఎప్పుడో నమ్మకం పోయిందని, తాజాగా ఐఏఎస్ అధికారులంటే కూడా నమ్మకం పోతోందని అన్నారు. ఐఏఎస్‌లు తీసుకునే నిర్ణయాలతో తమకు సంబంధం ఉండదన్నారు. మంత్రి డొక్కా మాణిక్య వర ప్రసాద్ తమ తప్పు లేదని అధికారులు అనడం సరికాదని, వారు అవినీతి మంత్రుల పేర్లు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. అనంతపురం సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి ఐఏఎస్ అధికారులు మంత్రులు చెప్పినట్లు వినడానికి చిన్నపిల్లలేం కాదని ఎద్దేవా చేశారు. అరెస్టైన ఐఏఎస్‌లు తాము అవినీతిపరులం కాదని చెప్పగలరా అని కమలాపురం ఎమ్మెల్యే వీర శివా రెడ్డి సవాల్ విసిరారు. మంత్రుల పైకి నెపం నెట్టడం సరికాదన్నారు. ఐఏఎస్‌ల ఫిర్యాదు అవినీతిపరులను రక్షించడానికి అన్నట్లుగా ఉందని విమర్శించారు. బండి ఎక్కడ తప్పుదోవ పడుతుందో ప్రభుత్వానికి సూచించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని మంత్రి మహీధర్ రెడ్డి అన్నారు.

మరోవైపు ఐఏఎస్‌ల వ్యాఖ్యలతో అదే కాంగ్రెసు పార్టీ చీఫ్ బొత్స సత్యనారాయణ, గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివ రావులు ఏకీభవించారు. మంత్రుల పాత్ర ఉంటే విచారించాలన్న వారి వాదనతో తాను ఏకీభవిస్తున్నానని బొత్స చెబుతూనే తెర వెనుక జరిగే వాటికి కేబినెట్ బాధ్యత ఉండదని చెప్పారు. అవినీతికి ఐఏఎస్‌లను బలి చేయడం బాధాకరమని రాయపాటి వారికి సానుభూతి వ్యక్తం చేశారు. ఇతర పార్టీలు అవినీతి ఐఏఎస్‌ల తీరు తప్పు పడుతూనే, నీతివంతమైన అధికారులకు మద్దతు ప్రకటించాయి. అయితే అవినీతి చేసిన అధికారులు కూడా మంత్రుల ఆదేశాలు లేకుండా చేయరని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, సిబిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. అవినీతికి పాల్పడని అధికారులను టార్గెట్ చేసుకుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. మంత్రులు చెప్పినట్లుగా మీరెందుకు నడుచుకుంటున్నారని అధికారులను వారు ప్రశ్నించారు. టిడిపి నేత యనమల కూడా కేవలం ఐఏఎస్‌లనే బాధ్యులను చేయడం సరికాదన్నారు. మంత్రుల బాధ్యత లేదన్న ఉండవల్లిపై ఆయన మండిపడ్డారు. మరికొందరు అధికారులు కేవలం ఐఏఎస్‌లనే బాధ్యులను చేయవద్దని అన్నారు. ఒత్తిడి కారణంగా తప్పు చేస్తే అధికారులు సిబిఐకి చెప్పాలని మాజీ అధికారి హెచ్ జె దొర సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+