సాక్షుల జాబితాలో పిసిసి చీఫ్ బొత్స, అంబటి రాంబాబు
ఎమ్మార్లో ఎపిఐఐసి వాటా ఎందుకు తగ్గింది? అప్పట్లో ప్రభుత్వ నిబంధనలను పాటించారా? ఎమ్మార్ ఒప్పందం జరిగినపుడు అసలేం జరిగింది అనే విషయాలపై బొత్స నుంచి సిబిఐ అధికారులు ఆరా తీసినట్లు సమాచారం. మరోవైపు ఇదే కేసు సాక్షుల జాబితాలో అప్పట్లో ఎపిఐఐసి చైర్మన్గా పనిచేసిన అంబటి రాంబాబును 27వ సాక్షిగా సిబిఐ పేర్కొంది. రాంబాబు హయాంలోనే ఎపిఐఐసి వాటా తగ్గిందనే ఆరోపణలు దగ్గర్నుంచి, రాంబాబు బంధువులకు విల్లాల కేటాయింపులు, ఇతరత్రా అంశాలపైనా సిబిఐ అధికారులు వివరణ తీసుకున్నారని సమాచారం. సిబిఐ విచారణ తర్వాత అప్పట్లో మీడియాతో మాట్లాడిన అంబటి రాంబాబు తాను సిబిఐ ముందుకు సాక్షిగానే వచ్చానని పేర్కొన్న విషయం తెలిసింది. ప్రస్తుత ఎపిఐఐసి ఎండి బిఆర్ మీనాను ఎమ్మార్ చార్జిషీట్లో 16వ సాక్షిగా సిబిఐ పేర్కొంది.
botsa satyanarayana ambati rambabu emaar cbi probe hyderabad బొత్స సత్యనారాయణ అంబటి రాంబాబు ఎమ్మార్ సిబిఐ దర్యాఫ్తు హైదరాబాద్
English summary
CBI named, PCC chief Botsa satyanarayana and YSR Congress Party spokes person Ambati Rambabu as witness in EMAAR.
Story first published: Monday, March 12, 2012, 16:07 [IST]