సాక్షుల జాబితాలో పిసిసి చీఫ్ బొత్స, అంబటి రాంబాబు

ఎమ్మార్లో ఎపిఐఐసి వాటా ఎందుకు తగ్గింది? అప్పట్లో ప్రభుత్వ నిబంధనలను పాటించారా? ఎమ్మార్ ఒప్పందం జరిగినపుడు అసలేం జరిగింది అనే విషయాలపై బొత్స నుంచి సిబిఐ అధికారులు ఆరా తీసినట్లు సమాచారం. మరోవైపు ఇదే కేసు సాక్షుల జాబితాలో అప్పట్లో ఎపిఐఐసి చైర్మన్గా పనిచేసిన అంబటి రాంబాబును 27వ సాక్షిగా సిబిఐ పేర్కొంది. రాంబాబు హయాంలోనే ఎపిఐఐసి వాటా తగ్గిందనే ఆరోపణలు దగ్గర్నుంచి, రాంబాబు బంధువులకు విల్లాల కేటాయింపులు, ఇతరత్రా అంశాలపైనా సిబిఐ అధికారులు వివరణ తీసుకున్నారని సమాచారం. సిబిఐ విచారణ తర్వాత అప్పట్లో మీడియాతో మాట్లాడిన అంబటి రాంబాబు తాను సిబిఐ ముందుకు సాక్షిగానే వచ్చానని పేర్కొన్న విషయం తెలిసింది. ప్రస్తుత ఎపిఐఐసి ఎండి బిఆర్ మీనాను ఎమ్మార్ చార్జిషీట్లో 16వ సాక్షిగా సిబిఐ పేర్కొంది.












Click it and Unblock the Notifications