బైపోల్స్ ఒకేసారి నిర్వహించాలి: ఈసికి జగన్ వర్గం లేఖ
కాగా తెలంగాణ ప్రాంతంలోని ఖాళీ అయిన ఆరు నియోజకవర్గాలు, సీమాంధ్ర ప్రాంతంలోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొవ్వూరులో ఒకసారి, జగన్ వర్గం ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో మరోసారి ఎన్నికలు జరిగేలా కాంగ్రెసు పార్టీ ముందుకు వెళుతున్న విషయం తెలిసిందే. ఇరు ప్రాంతాలలో ఒకేసారి ఎన్నికలు వస్తే ఎదుర్కోవడం కష్టమనే ఉద్దేశ్యంతో కాంగ్రెసు మొదట తెలంగాణలో ఎన్నికలు జరగాలని కోరుకుంటుంది. అందుకే ఎన్నికల సంఘం ఉప ఎన్నికల కోసం నోటిఫికేషన్ విడుదల చేసే వరకు జగన్ ఎమ్మెల్యేలపై వేటును ఆలస్యం చేయాలనే ఆలోచనతో ఉందనే వాదనలు ఉన్నాయి. కాంగ్రెసు వ్యూహంపై దెబ్బ కొట్టాలనే భావనతో వైయస్సార్ కాంగ్రెసు అన్ని నియోజకవర్గాలలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని ఈసికి లేఖ రాసింది.
Comments
ysr congress ys jagan telangana election commission hyderabad వైయస్సార్ కాంగ్రెసు వైయస్ జగన్ తెలంగాణ ఎన్నికల సంఘం హైదరాబాద్
English summary
YSR Congress Party chief YS Jaganmohan Reddy camp mlas wrote a letter to election commission about state bypoll. They appealed EC in their letter, release notification at a time for bypoll.
Story first published: Monday, February 13, 2012, 16:10 [IST]