చిరును ద్రోహిగా ప్రకటిస్తాం: భవానీపై దేవినేని హెచ్చరిక

తిడితే ప్రభుత్వాన్ని తిట్టుకోండి తప్ప చిరంజీవిని అనవద్దని మంత్రి రామచంద్రయ్య అంటున్నారని, ఆయన ప్రభుత్వంలో భాగం కాదా అని విస్మయం వ్యక్తంచేశారు. తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై మంత్రి రామచంద్రయ్య వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని విమర్శించారు. భవానీ ద్వీపాన్ని ధారాదత్తం చేసే జీవోను ప్రభుత్వం బహిర్గతం చేయాలని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య వేరుగా విజయవాడలో డిమాండ్ చేశారు. ఆ జీవోను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయాల్లో మారకం విధానాన్ని ప్రవేశపెట్టిన ఘనత చిరంజీవికే దక్కుతుందన్నారు. అలాంటి వ్యక్తిని రాజకీయాల్లో రైజింగ్ స్టార్ అని మంత్రి రామచంద్రయ్య పేర్కొనటం హాస్యాస్పదమన్నారు.












Click it and Unblock the Notifications