కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సంకెళ్లతో బస్తాలు మోసి జెపి నిరసన, పాదయాత్ర

By Pratap
|
Google Oneindia TeluguNews

Jayaprakash Narayana
కర్నూలు: రైతు సత్యాగ్రహ యాత్రను లోకసత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ శనివారం ఉదయం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నుంచి ప్రారంభించారు. ఈ యాత్ర రాయచూరు వరకు కొనసాగుతుంది. జయప్రకాష్ నారాయణ అంతకు ముందు నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో ప్రార్థనలు చేశారు. ఆ తర్వాత బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించి యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా జయప్రకాష్ నారాయణ సంకెళ్లతో బస్తాలు మోసి తన నిరనస తెలిపారు.

ఎక్కడ పండిన పంటను అక్కడే అమ్ముకునే అవకాశం రైతులకు ఉండాలని ఆయన అన్నారు. పండించిన పంటను అమ్ముకోవడానికి ఆంక్షలు పెట్టడం సరి కాదని ఆయన అన్నారు. ప్రభుత్వం చేసిన పాపాల వల్ల రెండేళ్లలో ఎరువుల ధఱలు రెండింతలు పెరిగాయని ఆయన విమర్శించారు. గిట్టుబాటు ధరలు సగానికి పడిపోయాయని ఆయన అన్నారు. జెపి యాత్రకు కాంగ్రెసు నాయకుడు రుద్రగౌడ్ మద్దతు తెలిపారు. రైతుల కోసం జైలుకు వెళ్లడానికైనా తాను సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పారు. రైతుల కోసం ఎవరు మద్దతిచ్చినా తీసుకుంటానని ఆయన చెప్పారు. తన యాత్రను తెలుగుదేశంశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి రైతు పోరుబాటతో పోల్చుకోలేనని ఆయన అన్నారు.

English summary
Loksatta president Jayaprakash Narayana has began his Satyagraha padayatra from emmiganooru of Kurnool district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X