తెలంగాణను కాంగ్రెసే పరిష్కరిస్తుంది:సిఎం, ప్రచారానికి సై
ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమం ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నడుస్తున్నాయని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ చీఫ్ బొత్స సత్యనారాయణ అన్నారు. అభ్యర్థి ఎవరు ఏమిటన్నది పక్కన పెడితే నాయకుడికి గెలుపు, ఓటమి ముఖ్యం కాదన్నారు. షబ్బీర్ అలీకి ప్రజల్లో ఎంతో ఆదరణ ఉందన్నారు. పార్టీ అభ్యర్థి విజయమే లక్ష్యంగా పనిచేయాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కామారెడ్డి నియోజకవర్గం నుంచి షబ్బీర్ అలీని పోటీకి దించాలని పార్టీ భావిస్తుండగా ఆయన విముఖత చూపుతున్నారని సమాచారం. అయితే ఓడినా తనకు న్యాయం జరుగుతుందని భావిస్తే పోటీ చేసేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారట. నియోజకవర్గ ప్రజలు కూడా షబ్బీర్ అలీనే సూచించారని సమాచారం.
Comments
kiran kumar reddy telangana nizamabad congress hyderabad కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ నిజామాబాద్ కాంగ్రెసు హైదరాబాద్
English summary
CM Kiran Kumar Reddy said that only Congress party will take decision on Telangana issue.
Story first published: Monday, February 20, 2012, 8:54 [IST]