విజయలక్ష్మికి టిక్కెట్పై మ.నగర్ కాంగ్రెస్ నేతల గుర్రు

ఈ నేపథ్యంలో ఆయన సతీమణి విజయలక్ష్మికే సీటు కేటాయించేందుకు కాంగ్రెసు పార్టీ నిర్ణయించుకుంది. తెలంగాణ సెంటిమెంట్ సమయంలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి సానుభూతి ఓట్లతో ఈ సీటును గెలిపించుకోవచ్చునని కాంగ్రెసు భావిస్తోంది. ఇందులో భాగంగానే ఆమెను రంగంలోకి దింపినట్లుగా కనిపిస్తోంది. అయితే ఆమె అభ్యర్థిత్వాన్ని మాత్రం జిల్లా నేతలు వ్యతిరేకిస్తున్నారు. విజయలక్ష్మి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న నేతలకే జిల్లాకు చెందిన మంత్రి డికె అరుణ మద్దతు కూడా ఉంది. ఎన్నో ఏళ్లుగా పార్టీకి సేవలందిస్తున్న తమను కాదని ఇతరులకు టిక్కెట్ కేటాయించడమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. కార్యకర్తల అభిప్రాయం తీసుకొని టిక్కెట్ కేటాయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications