వైయస్సార్ జమానాలో చక్రం తిప్పిన ఎసి రెడ్డి?

వైయస్ రాజశేఖర రెడ్డితో పాటు ఇతర ప్రభుత్వ పెద్దలు నిర్దేశించడం వల్లనే సాక్షి పత్రికకు భారీగా వాణిజ్య ప్రకటనలు ఇచ్చామని వారు చెప్పినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి నుంచి, ఇతర ప్రభుత్వ పెద్దల నుంచి మౌఖిక అదేశాలు రావడం వల్లనే సాక్షికి ఎక్కువగా వాణిజ్య ప్రకటనలు ఇచ్చామని వారు చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయంలో ఎ చంద్రశేఖర రెడ్డి కీలక పాత్ర పోషించారని చెబుతున్నారు.
ముఖ్యమంత్రి మీడియా కార్యదర్శి ఎ. చంద్రశేఖర రెడ్డి సూచన మేరకే ప్రకటనలు ఇస్తున్నట్లు అప్పట్లో ఓ ఫైలులో సమాచార శాఖ అధికారులు నోట్ చేశారు. దీంతో ఆయనను సిబిఐ గురువారం రెండున్నర గంటల పాటు విచారించింది. తాను వార్తలకు సంబంధించిన వ్యవహారాలను మాత్రమే చూశానని, వాణిజ్య ప్రకటనల వ్యవహారం తనకు తెలియదని అతను సిబిఐ అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత సాయంత్రం అప్పటి సమాచార కమిషనర్ పార్థసారథిని రప్పించి, ప్రశ్నిస్తూ మధ్యలో పక్క గదిలో ఉన్న చంద్రశేఖర రెడ్డిని సిబిఐ అధికారులు పిలిచారు. ఆ తర్వాత పార్థసారథిని పంపించేసి చంద్రశేఖర రెడ్డిని మళ్లీ విచారించారు.
-
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications