రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉప ఎన్నికలపై లేకుండా చూసుకుంటాం: పురంధేశ్వరి

By Pratap
|
Google Oneindia TeluguNews

Daggubati Purandeswari
రాజమండ్రి: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ప్రభావం రాష్ట్రంలోని ఉప ఎన్నికలపై పడకుండా చూసుకుంటామని కాంగ్రెసు నేత, కేంద్ర మానవ వనరులు శాఖ సహాయ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ఆత్మపరిశీలన చేసుకుంటామని ఆమె చెప్పారు. పార్టీలో సంస్థాగత లోపాలున్నాయని, వాటిని సరిచేసుకోవాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో గతంలో కన్నా మంచి ఫలితాలే సాధించామని, అయితే పంజాబ్‌లో అనుకున్న మేరకు ఫలితాలు సాధించలేకపోయామని ఆమె అన్నారు. ఈ విషయాలపై పరిశీలన జరుపుకుని లోపాలు సరిదిద్దుకుంటామని ఆమె అన్నారు.

మహిళా బిల్లు ఆమోదానికి అన్ని పార్టీల సహకారం అవసరమని ఆమె రాజమండ్రి పర్యటనలో మీడియా ప్రతినిధులతో అన్నారు. జాతీయ స్థాయిలో ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ పరీక్షా విధానం 2013 నుంచి అమలులోకి వస్తుందని ఆమె చెప్పారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ప్రభావం మన రాష్ట్రంలోని ఉప ఎన్నికలపై పడదని ఆమె అభిప్రాయపడ్డారు.

English summary
Union minister Daggubati Purandeswari said that the effect five state election results may not be on AP bypolls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X