చిరంజీవిని ఎఐసిసి చూసుకుంటుంది: బొత్స సత్తిబాబు

రైతులకు గిట్టుబాట ధర లభించడం లేదనే ప్రతిపక్షాల విమర్శలను ఆయన తిప్పికొట్టారు. సోనియా గాంధీ ప్రధాని పదవిని త్యాగం చేశారని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత ముఖ్యమంత్రి సీటు తనకు కావాలని అడుగుతున్నాడని ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. ఉత్తరప్రదేశ్లో ప్రాంతీయ పార్టీల హవా పెరిగిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సంబరపడుతున్నారని, నిజానికి జాతీయ పార్టీల సీట్లే మారాయని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీ రేసులో ముందుందని ఆయన అన్నారు. రాజ్యసభ ఎన్నికల కోసం తాము 25 మంది పేర్లను పార్టీ అధిష్టానానికి పంపినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications