వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేతాజీ జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో పనిచేస్తారు: అఖిలేష్

By Pratap
|
Google Oneindia TeluguNews

Akhilesh Yadav
లక్నో: తన తండ్రి నేతాజీ జాతీయ రాజకీయాల్లోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లోనూ ఉంటారని కాబోయే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ చెప్పారు. ఎస్పీ శానససభా పక్ష నేతగా ఎన్నికైన తర్వాత ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. తమకు ములాయం సింగ్ ఆశీస్సులు అవసరమని ఆయన అన్నారు. రాష్ట్రాభివృద్ధికి నిజాయితీతో పనిచేస్తామని ఆయన హామీ ఇచ్చారు. తమ పార్టీకి మెజారిటీ ఇచ్చిన ప్రజలకు, కులమతాలకు అతీతంగా వ్యవహరించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల ప్రణాళికలో పొందుపరిచిన హామీలను తాము అమలు చేస్తామని ఆయన చెప్పారు

ఎవరిపైనా కక్ష తీర్చుకునే పద్ధతి ఉండదని ఆయన అన్నారు. బిఎస్పీ నేత మాయావతిని ఉద్దేశించి ఆయన ఈ మాటలన్నారు. చూడడానికి ఎవరు వెళ్లినా వెళ్లకపోయినా మాయావతి విగ్రహాలు అలాగే ఉంటాయని, ఖాళీ స్థలాన్ని విద్యా సంస్థలకు, ఆస్పత్రులకు వాడుకుంటామని ఆయన చెప్పారు. తనను శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్న శాసనసభ్యులకు ఆయన కృతజ్ఢతలు చెప్పారు. తాను ఈ నెల 15వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తానని, వేదికను తర్వాత ప్రకటిస్తామని ఆయన చెప్పారు.

English summary
With his head firmly on his shoulders after he was chosen by the Samajwadi party as the next chief minister of Uttar Pradesh, Akhilesh Yadav said on Saturday that his focus would be to honestly work for the development of the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X