ఉప ఎన్నికల ఎఫెక్ట్ : ఎమ్మెల్యేలు లేక అసెంబ్లీ వెలవెల

కాగా తాగునీటి సమస్యపై సభ రసాభాసగా మారింది. తాగునీటి సమస్యపై విపక్షాలు అధికార పక్షాన్ని నిలదీశాయి. 2014 చివరి నాటికి కృష్ణా మూడోదశ ద్వారా హైదరాబాదుకు తాగునీరు అందిస్తామని పురపాలక సంఘ మంత్రి మహీధర్ రెడ్డి సభలో ప్రకటించారు. 2017 నాటికి గోదావరి నుంచి హైదరాబాదుకు తాగునీరు అందిస్తామన్నారు. నగరంలో వాల్టా చట్టాన్ని అమలుకు టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. మంత్రి సమాధానంపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. తాగునీటి సరఫరా దారుణంగా ఉన్నా మంత్రి మభ్యపెడుతున్నారని విపక్షాలు విమర్శించాయి. ఉద్యమాలు చేస్తే కానీ నీళ్లు ఇచ్చేలా లేరని లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు. ప్రభుత్వం వివరణపై ఎంఐఎం అసంతృప్తి వ్యక్తం చేసింది. హైదరాబాదుకు మంచినీటి సరఫరాలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బిజెపి వాకౌట్ చేసింది.












Click it and Unblock the Notifications